Facebook post: ప్రియురాలితో దిగిన ఫొటోను ఫేస్బుక్లో షేర్ చేసిన యువకుడు.. మరుసటి రోజే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..
ABN , First Publish Date - 2022-08-20T00:07:26+05:30 IST
వారిద్దరిదీ ఒకే ఊరు. కొన్నాళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెతో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. ఇటీవల ప్రియురాలితో దిగిన ఫొటోను ఫేస్బుక్లో షేర్ చేశాడు. అయితే..
వారిద్దరిదీ ఒకే ఊరు. కొన్నాళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెతో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. ఇటీవల ప్రియురాలితో దిగిన ఫొటోను ఫేస్బుక్లో షేర్ చేశాడు. అయితే ఇదే అతడి పాలిట మృత్యుపాశంగా మారుతుందని అతను ఊహించలేకపోయాడు. మరుసటి రోజు జరిగిన అనూహ్య ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే..
బీహార్ (Bihar) రాష్ట్రం చాప్రా జిల్లా డెర్ని పరిధి.. పతర బిన్ టోలి పరిధికి చెందిన లహ్వర్ కుమార్కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఎదురెదురు ఇళ్లు కావడంతో ఇద్దరి మధ్య ఇటీవల ప్రేమ వ్యవహారం (love affair) నడిచింది. ఇంట్లోని వారికి తెలీకుండా కలుసుకునేవారు. ఈ క్రమంలో ఆమెతో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. అయితే ఇటీవల ప్రియురాలితో దిగిన ఫేస్బుక్లో షేర్ (Facebook post) చేశాడు. దీంతో వారి ప్రేమ విషయం గ్రామం మొత్తం తెలిసిపోయింది. గురువారం రాత్రి మల విసర్జనకు వెళ్లిన లహ్వర్ కుమార్.. తిరిగి ఇంటికి రాలేదు.
Attack on girl: ఆలయం నుంచి వస్తున్న బాలిక వెనుకే వెళ్లాడు.. మర్కెట్ దగ్గరికి రాగానే వెనుక వైపు నుంచి ఒక్కసారిగా..
అర్ధరాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. ఊరంతా వెతికినా ఆచూకీ లభించలేదు. గ్రామ సమీపంలోని నదిలో చేపల వేట కోసం జాలర్లు వలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం అందులో చేపల వలలో మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా, అదే రోజు రాత్రి లహ్వర్ కుమార్ ప్రియురాలి కుటుంబ సభ్యులు.. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో వారే యువకుడిని హత్య చేసి ఉంటారని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.