కుటుంబ కలహాలతో యువకుడు
ABN , First Publish Date - 2021-04-23T06:38:02+05:30 IST
కుటుంబ కలహాల కారణంగా ఓ యువకుడు గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
భువనగిరి రూరల్, ఏప్రిల్ 22: కుటుంబ కలహాల కారణంగా ఓ యువకుడు గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే ఎస్ఐ ఎస్కే సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని జలీల్పురకు చెందిన మక్తలూ కర్ కిషోర్ కుమారుడు మక్తలూకర్ రవితేజ (21) మాంసం దుకాణం నిర్వహిసు ్తన్నాడు. అయితే కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై పగిడిపల్లి - భువనగిరి రైల్వే స్టేషన్ల మధ్య 237/2-4మైలు రాయి వద్ద సికింద్రాబాద్ నుంచి కాజీపేట వైపుకు వెళ్తున్న గుర్తుతెలియని గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు.