TS News: ఎస్సై పరీక్ష సరిగా రాయలేదని యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-10T15:49:13+05:30 IST
ఎస్సై పరీక్ష సరిగా రాయలేదంటూ ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.
కామారెడ్డి: ఎస్సై పరీక్ష సరిగా రాయలేదంటూ ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ చెరువులో దూకి పంచశీల(20) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ పూర్తి చేసిన పంచశీల హైదరాబాద్లో ఉంటూ మూడు రోజుల క్రితం నిర్వహించిన ఎస్సై ప్రాథమిక పరీక్ష రాసింది. అయితే పరీక్ష సరిగా రాయలేనని మనస్థాపంతో యువతి ప్రాణాలు తీసుకుంది. మృతురాలు మద్నూర్ మండలం కోరేగావ్ గ్రామం వాసురాలిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.