ప్రియుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ యువతి ఆగ్రహం.. చివరకు మద్యం మత్తులో ఆమె చేసిన పని..

ABN , First Publish Date - 2022-09-21T23:05:47+05:30 IST

ప్రేమికుల మధ్య కొన్నిసార్లు విచిత్ర సమస్యలు తలెత్తుతుంటాయి. మోసపోయామని తెలుసుకున్న వారు ఎలాగైనా తాము ప్రేమించిన వారిని దక్కించుకునేందుకు ఎలాంటి..

ప్రియుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ యువతి ఆగ్రహం.. చివరకు మద్యం మత్తులో ఆమె చేసిన పని..

ప్రేమికుల మధ్య కొన్నిసార్లు విచిత్ర సమస్యలు తలెత్తుతుంటాయి. మోసపోయామని తెలుసుకున్న వారు ఎలాగైనా తాము ప్రేమించిన వారిని దక్కించుకునేందుకు ఎలాంటి సహసాలకైనా సిద్ధపడుతుంటారు. ఈ క్రమంలో చివరకు కొందరు తాము అనుకున్నది సాధిస్తుండగా, మరికొందరు విఫలమై.. చివరకు హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుంటారు. మధ్యప్రదేశ్‌లో ఓ యువతి విషయంలో ఇలాగే జరిగింది. తన ప్రియుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని తెలుసుకున్న యువతి.. చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మద్యం మత్తులో ఆమె చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. 


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్‌ పరిధి విజయ్ నగర్ ప్రాంతంలోని షాపింగ్ మాల్‌లో ఓ యువతి పని చేస్తోంది. ఈమెకు కొన్ని నెలల క్రితం ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ ఒకే చోట పని చేస్తుండడంతో బాగా దగ్గరయ్యారు. కొన్నాళ్లకు ఈ పరిచయం ప్రేమగా (love) మారింది. కొన్ని నెలలు గడిచాక.. ప్రియుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. వేరే అమ్మాయితో తిరుగుతూ యువతిని పక్కన పెట్టాడు. దీనిపై పలుమార్లు అతన్ని నిలదీసినా పట్టించుకోలేదు. దీంతో చివరకు విసిగిపోయి షాకింగ్ నిర్ణయం (Shocking decision) తీసుకుంది. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఫుల్‌గా మందు తాగి, షాపింగ్ మాల్ పైకి ఎక్కింది. ఆత్మహత్య చేసుకుంటానంటూ గట్టిగా అరవడం మొదలెట్టింది. ఆమె కేకలు విన్న స్థానికులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని యువతికి నచ్చజెప్పాలని చూశారు.

నిర్మానుష్య ప్రదేశంలో దుస్తులు లేకుండా పడి ఉన్న బాలిక.. మాట్లాడలేని స్థితిలోనూ హావభావాల ద్వారా ఆమె చెప్పింది విని..


కొన్ని గంటల అనంతరం ఎలాగోలా ఆమె వద్దకు వెళ్లి.. ప్రియుడికి కాల్ చేసి మాట్లాడించారు. చివరకు ఆమెను క్షేమంగా కిందకు దించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలా చోటుచేసుకున్నాయి. ఇండోర్‌లోని లాసుడియాలో కొద్ది రోజుల క్రితం ఓ మహిళ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కింది. పై నుంచి దూకేస్తానని బెదిరించింది. పోలీసులు అక్కడికి చేరుకుని, ఆమెను శాంతింపజేసి కిందకు దించారు. అదేవిధంగా ఇటీవల ఛోటీ గ్వాల్తోలి ప్రాంతంలో సిబ్బందితో వివాదం తలెత్తడంతో ఓ హోటల్ ఉద్యోగి టెర్రస్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే పోలీసులు అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

తలుపులు వేసిన ఇంటి నుంచి వెలుతురు రావడాన్ని గమనించిన స్థానికులు.. టెర్రస్‌ పైకి వెళ్లి పరిశీలించగా షాకింగ్ సీన్..



Updated Date - 2022-09-21T23:05:47+05:30 IST