‘నా ఇష్టపూర్వకంగానే ఇతడిని పెళ్లి చేసుకున్నాను. ప్లీజ్.. దయచేసి మమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టకండి..’

ABN , First Publish Date - 2022-09-04T00:26:38+05:30 IST

ప్రేమికుల (lovers) విషయంలో కొన్నిసార్లు సినిమా తరహా ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయి. కొందరు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో..

‘నా ఇష్టపూర్వకంగానే ఇతడిని పెళ్లి చేసుకున్నాను. ప్లీజ్.. దయచేసి మమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టకండి..’

ప్రేమికుల (lovers) విషయంలో కొన్నిసార్లు సినిమా తరహా ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయి. కొందరు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. కొందరు తల్లిదండ్రుల మాటకు కట్టుబడి నడుచుకుంటే.. మరికొందరు ఇంట్లోని వారిని ఎదిరించి మరీ.. తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా బీహార్‌లో ఓ ప్రేమ జంటకు కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. అయినా వారు పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. ‘‘నా ఇష్టపూర్వకంగానే ఇతడిని పెళ్లి చేసుకున్నాను. ప్లీజ్.. దయచేసి మమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టకండి..’’ అంటూ యువతి ఓ వీడియో విడుదల చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


బీహార్ (Bihar) రాష్ట్రం మహనార్ పరిధి కరణౌతి గ్రామానికి చెందిన విశాల్ కుమార్‌కు, ప్రేమికా భైరెహో గ్రామానికి చెందిన బంధన్ కుమారి అనే యువతికి కొన్నేళ్లుగా పరిచయం ఉంది. వీరి పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినా ఇద్దరూ ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 2న పారిపోయి వివాహం చేసుకున్నారు. తమ కుమార్తెను విశాల్ కిడ్నాప్ చేశాడంటూ.. బంధన్ కుమారి తల్లిదండ్రులు ఆగస్టు 4న మహనార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

9 ఏళ్ల క్రితం పెళ్లి.. అప్పటికే ముగ్గురు కూతుళ్లు.. కొడుకు కోసం ఆ తండ్రి ఆశపడితే నాలుగోసారి ఒకే కాన్పులో ముగ్గురు కూతుళ్లు..!


అప్పటి నుంచి ఇద్దరూ పరారీలోనే ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ విషయం తెలిసి బంధన్ కుమారి.. ఇటీవల వీడియో విడుదల చేసింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను ఇష్టపడే విశాల్‌ను పెళ్లి చేసుకున్నానని చెప్పింది. కలిసి జీవించాలని అనుకుంటున్నామని, తమను ఎవరూ ఇబ్బంది పెట్టొద్దని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలంటూ వేడుకుంది. పోలీసులు మాట్లాడుతూ.. వారిద్దరూ రాష్ట్రం వెలుపల ఉన్నట్లు తెలుస్తోందని, మేజర్లు అయితే వారి ఇష్ట ప్రకారమే వివాహం చేసుకోవచ్చని తెలిపారు. అలాగే వారికి భద్రత కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

గుడిలో వీళ్లిద్దరూ ఇలా సంతోషంగా పెళ్లి చేసుకున్నారు కానీ.. ఆ యువతి అతడి వద్దకు చేరడానికి ఎన్ని కష్టాలు పడిందంటే..



Updated Date - 2022-09-04T00:26:38+05:30 IST