శేషవాహనంపై ఆదికేశవన్
ABN , First Publish Date - 2021-02-25T05:30:00+05:30 IST
నవాబుపేట ఉడయవర్లు దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
కనుల పండువగా ధ్వజారోహణం
నెల్లూరు(సాంస్కృతికం), ఫిబ్రవరి 25 : నవాబుపేట ఉడయవర్లు దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి స్వామివారికి శేషవాహనంపై పేట ఉత్సవం కనుల పండువగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవ, యాగశాల ప్రవేశం, ధ్వజ కుంభస్థాపనతోపాటు ధ్వజస్తంభ తిరుమంజనం, ధ్వజారోహణ వేడుక జరిగాయి. భక్తులు గరుడ ప్రసాదం కోసం బారులు తీరారు. సాయంత్రం ఆరాధన, సహస్ర దీపాలంకరణ, ఊంజల్సేవ నిర్వహించారు. అనంతరం ఆదికేశవ స్వామికి శేషవాహనంపై నగరోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉభయకర్తలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ధర్మకర్త పల్లాప్రోలు రామకృష్ణమాచార్యులు పర్యవేక్షించారు.