హైదరాబాద్లో ఏడో క్లాస్రూం కేంద్రాన్ని ప్రారంభించిన Aakash+Byju’s
ABN , First Publish Date - 2022-05-27T00:10:17+05:30 IST
టెస్ట్ ప్రిపరేటరీ సేవల్లో అగ్రగామి సంస్థ అయిన ఆకాష్+బైజూస్ హైదరాబాద్లోని కొండాపూర్లో నేడు నూతన
హైదరాబాద్: టెస్ట్ ప్రిపరేటరీ సేవల్లో అగ్రగామి సంస్థ అయిన ఆకాష్+బైజూస్ హైదరాబాద్లోని కొండాపూర్లో నేడు నూతన క్లాస్రూం సెంటర్ను ప్రారంభించింది. నగరంలో ఇది ఏడో కేంద్రం కావడం గమనార్హం. ఇందులో 11 తరగతి గదులు ఉంటాయి. ఇవి దాదాపు 1000 మంది విద్యార్థులకు తగిన సౌకర్యాలు అందించగలవని ఆకాష్+బైజూస్ రీజనల్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ కుమార్ మిశ్రా తెలిపారు. ఈ నూతన కేంద్రం మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల అవసరాలతోపాటు ఫౌండేషన్ స్థాయి కోర్సుల అవసరాలను సైతం తీరుస్తుందని అన్నారు. ఒలింపియాడ్లో సత్తా చాటాలనుకునే విద్యార్థులతోపాటు డాక్టర్లు, ఐఐటియన్లుగా మారాలనుకునే స్థానిక విద్యార్థులకు ఈ నూతన క్లాస్ రూం ఓ వరమని అన్నారు.
కొండాపూర్ వద్ద నూతన క్లాస్ రూం కేంద్రాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని మిశ్రా పేర్కొన్నారు. తమ జాతీయ నెట్వర్క్కు ఈ శాఖను జోడించడం ద్వారా నాణ్యమైన బోధన, ఆధునిక మౌలిక వసతులు, సాంకేతిక ఆధారిత వ్యవస్థలను వినియోగించి దేశవ్యాప్తంగా విద్యార్థులకు అభ్యాస వాతావరణం సృష్టించాలన్న నిబద్ధతతో తాము పనిచేస్తున్నట్టు చెప్పారు. కాగా, ఆకాష్లో చేరాలనుకునే విద్యార్థులు ఇన్స్టెంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ లేదంటే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.