‘అన్నం బండి’కి 45 రోజులు

ABN , First Publish Date - 2022-08-14T03:07:59+05:30 IST

డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పవన్‌కల్యాణ్‌ ఆశయంతో ప్రారంభించిన పవనన్న అన్నం బండి కార్యక్రమం 45రోజులు పూర్తి చేసుకుం

‘అన్నం బండి’కి 45 రోజులు
అన్నదానం చేస్తున్న సిద్దు తదితరులు

కావలిటౌన్‌, ఆగస్టు13: డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పవన్‌కల్యాణ్‌ ఆశయంతో ప్రారంభించిన పవనన్న అన్నం బండి కార్యక్రమం 45రోజులు పూర్తి చేసుకుందని జనసేన నాయకులు ఎం సిద్దు పేర్కొన్నారు. ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఎదురుగా ఏర్పాటు చేసిన అన్నం బండి వద్ద శనివారం జనసేన కార్యకర్తలు, పవన్‌కల్యాణ్‌ అభిమానులతో కలిసి ఆయన పేదలకు అన్నదానం చేసారు. అనంతరం మాట్లాడుతూ చుట్టుపక్కల పల్లెల నుంచి ఏరియా వైద్యశాలకు వచ్చే పేదవాళ్ల ఆకలి తీర్చాలన్న  సంకల్పంతో పవనన్న అన్నంబండిని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో  తోట శేషయ్య, సురేంద్ర, రమణయ్య, కృష్ణ, తిరుపతి, మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-14T03:07:59+05:30 IST