పెన్నాలో వ్యక్తి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-05-18T03:36:22+05:30 IST

పెన్నాలో నిర్మాణంలో ఉన్న బ్యారేజీకి, పాత ఆనకట్టకు మధ్య నీటిలో తేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం స్థాని

పెన్నాలో వ్యక్తి అనుమానాస్పద మృతి
పెన్నానదిలో మృతి చెందిన వ్యక్తి

సంగం, మే 17:  పెన్నాలో నిర్మాణంలో ఉన్న బ్యారేజీకి, పాత ఆనకట్టకు మధ్య నీటిలో తేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పరిశీలించారు. మృతుడు నల్లని ప్యాంట్‌, నల్లగళ్ల చొక్కా ధరించి ఉన్నాడు. వయసు 58 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ప్రమాదవశాత్తూ పడి మృతి చెందాడా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా...? అనే అనుమానంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ నాగార్జునరెడ్డి తెలిపారు.


Updated Date - 2022-05-18T03:36:22+05:30 IST