National Flagపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు...అరెస్ట్ చేయాలన్న ఆప్

ABN , First Publish Date - 2022-06-01T12:55:57+05:30 IST

జాతీయ జెండాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక బీజేపీ నేత ఈశ్వరప్పపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు...

National Flagపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు...అరెస్ట్ చేయాలన్న ఆప్

బెంగళూరు(కర్ణాటక): జాతీయ జెండాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక బీజేపీ నేత ఈశ్వరప్పపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు.జాతీయ జెండాపై చేసిన వ్యాఖ్యలకు కర్ణాటక బీజేపీ నాయకుడు ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలని ఆప్ డిమాండ్ చేసింది.ఆర్‌ఎస్‌ఎస్ జెండా జాతీయ జెండా అవుతుందని కర్ణాటక బీజేపీ నేత ఈశ్వరప్ప ఇటీవల వ్యాఖ్యానించారు.కాషాయ జెండాకు వేల సంవత్సరాలుగా గౌరవం ఉందని, అది నిస్సందేహంగా ఏదో ఒక రోజు జాతీయ జెండా అవుతుందని బీజేపీ ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ మంత్రి ఈశ్వరప్ప చెప్పి వివాదానికి తెర లేపారు.నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకుడిపై ఫిర్యాదు చేశానని ఆప్ నేత సంజయ్ చెప్పారు.ఈశ్వరప్ప వ్యాఖ్యలకు గాను ఆయనను అరెస్టు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.


Updated Date - 2022-06-01T12:55:57+05:30 IST