AP News: హైకోర్టులో ఏబీవీ కోర్టు ధిక్కార పిటిషన్

ABN , First Publish Date - 2022-08-18T21:16:30+05:30 IST

సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) ఏపీ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.

AP News: హైకోర్టులో ఏబీవీ కోర్టు ధిక్కార పిటిషన్

అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) ఏపీ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. గతంలో హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ (Petition)ను విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ లాయర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్‌ 15కి వాయిదా వేశారు. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను గతంలో హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వ అప్పీల్‌ను కూడా సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టేసింది. తనకు సస్పెన్షన్‌ విధించిన నాటినుంచి పూర్తి జీతం ఇవ్వాలంటూ సీఎస్‌కు రెండుసార్లు లేఖ రాసినట్లు పిటిషన్‌లో ఏబీవీ పేర్కొన్నారు. అయినా తనకు జీతం ఇవ్వలేదని కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు కేవలం 2022 ఏప్రిల్ 22 నాటి నుంచే జీతం ఇచ్చారని, హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-18T21:16:30+05:30 IST