AP High Court: ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ వాయిదా
ABN , First Publish Date - 2022-09-09T04:38:57+05:30 IST
ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో..
అమరావతి: ఏబీ వెంకటేశ్వరరావు (Ab Venkateswararao) కేసుపై ఏపీ హైకోర్టు (Ap High Court)లో విచారణ జరిగింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో ఏబీవీ తరపున స్క్వాష్ పిటిషన్ దాఖలు అయింది. దీంతో ఏబీవీ తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు (Seniour Advocate Adinarayana Rao) వాదనలు వినిపించారు. ఏబీవీని రిటైర్ అయ్యేవరకు వేధించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లాయర్ తెలిపారు. పరికరాలే కొనుగోలు చేయనప్పుడు అవినీతికి ఆస్కారం ఎక్కడుందని.. ఏసీబీ కేసులో మరికొందరితో కలిసి కుట్ర చేసినట్లు లాయర్ పేర్కొన్నారు.
కానీ ఎఫ్ఐఆర్లో ఏబీవీని ఒక్కడినే నిందితుడిగా చేర్చారని.. అలాంటప్పుడు కుట్ర చేసే అవకాశం ఎక్కుడుంటుందని లాయర్ వాదించారు. 41ఏ నోటీసు ఇవ్వకుండా తప్పించుకునేందుకే ఎఫ్ఐఆర్లో 409 సెక్షన్ను చేర్చారని తెలిపారు. ఏసీబీ కేసు నమోదు చేసి ఏడాదిన్నర అయినా దర్యాప్తు పూర్తి చేయలేదని.. వెంటనే కేసు కొట్టివేయాలని జడ్జిని లాయర్ ఆదినారాయణరావు కోరారు. దీంతో కేసు విచారణను కోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.