Gyanvapi case: ముస్లింల తరపు న్యాయవాది అభయ్‌నాథ్ యాదవ్‌కు గుండెపోటు

ABN , First Publish Date - 2022-08-01T15:33:24+05:30 IST

వారాణసీ నగరంలోని జ్ఞాన‌వాపి మ‌సీదు కేసులో(Gyanvapi case) ముస్లింల తరపున....

Gyanvapi case: ముస్లింల తరపు న్యాయవాది అభయ్‌నాథ్ యాదవ్‌కు గుండెపోటు

వారాణసీ(ఉత్తరప్రదేశ్):వారాణసీ నగరంలోని జ్ఞాన‌వాపి మ‌సీదు కేసులో(Gyanvapi case) ముస్లింల తరపున వాదించిన(Muslim side) సీనియర్ న్యాయవాది(senior advocate) అభయ్ నాథ్ యాదవ్(Abhay Nath Yadav) ఆదివారం రాత్రి గుండెపోటుతో(heart attack) మరణించారు. జ్ఞాన‌వాపి మ‌సీదు వివాదంపై కోర్టులో ఉన్న కేసులో అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరపున అభయ్ నాథ్ వాదిస్తున్నారు.అభయ్ నాథ్ కు ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో అతన్ని హుటాహుటిన త్రీమూర్తి ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అభయ్ మరణించారని ప్రకటించారు. 


జ్ఞాన‌వాపి మ‌సీదు, శిృంగార్ గౌరీ(Shringar Gauri and Gyanvapi cases) వివాదం కేసులో అభయ్ నాథ్ యాదవ్ ఆగస్టు 4వతేదీన కోర్టులో ముస్లింల తరపున తన వాదన వినిపించాల్సి ఉండగా, ఆకస్మికంగా న్యాయవాది మరణించారు.జ్ఞాన‌వాపి మ‌సీదు కేసును లోయర్ కోర్టు విచారిస్తున్న నేపథ్యంలో దీనిపై అక్టోబరులో విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.సీనియర్ న్యాయవాది గుండెపోటుతో మరణించడంపై బనారస్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నిత్యానందరాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-08-01T15:33:24+05:30 IST