నేపాల్ ప్రధాని మతిస్థిమితం కోల్పోయారు: అభిషేక్ మను
ABN , First Publish Date - 2020-07-14T17:26:27+05:30 IST
నేపాల్ ప్రధాని కేపీ ఓలీ ఒక వింత ప్రకటన చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. శ్రీరాముడు నేపాలీ అని, భారతదేశంలో నకిలీ అయోధ్య ఉందంటూ ...
న్యూఢిల్లీ: నేపాల్ ప్రధాని కేపీ ఓలీ ఒక వింత ప్రకటన చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. శ్రీరాముడు నేపాలీ అని, భారతదేశంలో నకిలీ అయోధ్య ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింగ్వి స్పందిస్తూ నేపాల్ ప్రధాని మతిస్థిమితం కోల్పోయినట్లున్నారని అన్నారు. ఒక ట్వీట్లో అభిషేక్... నేపాల్ ప్రధాని చైనా ఆదేశాల మేరకే ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారని, మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపిస్తున్నారని పేర్కొన్నారు. కాగా ఇటీవలి కాలంలో నేపాల్ ప్రధాని భారత్కు వ్యతిరేకంగా పలు విమర్శలు చేస్తూవస్తున్నారు.