రెండేళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం
ABN , First Publish Date - 2021-07-25T05:57:24+05:30 IST
వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని టీడీపీ ని యోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు.
టీడీపీ ఇన్చార్జి ఎరిక్షన్బాబు
పుల్లలచెరువు, జూలై 24 : వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని టీడీపీ ని యోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. శనివారం మండలంలోని కొమరోలు, కవలకుంట్ల పంచాయతీల్లో టీడీపీ కమిటీల ని యామకం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎరిక్షన్బాబు పాల్గొన్నారు. గ్రామాల్లో ఆయనకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అ పూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడా రోడ్డుగానీ, గ్రామాల్లో ఇళ్లు గానీ నిర్మించలేదని, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అ న్నట్లుగా ఉందని వైసీపీ పాలనను ఎరిక్షన్ బాబు ఎండగట్టారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని, కార్యకర్తలకు ఏ స మస్య వచ్చినా అండగా ఉంటానని తెలిపారు. పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు అంద రమూ కలిసి శ్రమించాలని ఎరిక్షన్బాబు పి లుపునిచ్చారు. అనంతరం టీడీపీ కొమరోలు గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా కోనకంచి శ్రీ ను, కవలకుంట్ల నారు పెద్ద అచ్చిరెడ్డి నియమించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్, టీడీపీ మండల నాయకులు కాకర్ల కోటయ్య, కుమార్, నారు బాలకోటిరెడ్డి, మాజీ సర్పంచి నారు వెంకటరెడ్డి, తెలుగుయువత ద్వారకచర్ల అంజిరెడ్డి, నా రు వెంకట్రామిరెడ్డి, నారు మల్లికార్జునరెడ్డి, స ర్పంచులు ఓబులు, శ్రీను పాల్గొన్నారు.