‘ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి’కి ఉత్తమ న్యూస్రీడర్ పురస్కారం
ABN , First Publish Date - 2022-04-25T19:27:17+05:30 IST
ప్రముఖ న్యూస్ చానల్ ‘ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి’కి ఆరాధన టీవీ న్యూస్రీడర్స్- 2021 ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు.
హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి : ప్రముఖ న్యూస్ చానల్ ‘ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి’కి ఆరాధన టీవీ న్యూస్రీడర్స్- 2021 ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు. ఆరాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం త్యాగరాయగానసభలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ న్యూస్రీడర్ పురస్కారాన్ని ‘ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి’ న్యూస్రీడర్ నీలిమారాణికి బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ జి. భవానీ ప్రసాద్ ఈ సందర్భంగా పురస్కారాన్ని ప్రదానం చేసి మాట్లాడారు.
న్యూస్ చానల్ల న్యూస్రీడర్లు మంచి ఉచ్ఛారణతో వార్తలు చదువుతూ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారన్నారు. సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, పూర్వ న్యాయమూర్తి బూర్గుల మధుసూదన్ మాట్లాడారు. ఇదే సందర్భంగా పలు చానల్లకు చెందిన న్యూస్రీడర్లకు పురస్కారాలను ప్రదానం చేశారు. వ్యాఖ్యాత్రి ఎంకేఆర్ ఆశాలత, లయన్ హనుమంతరావు, చిల్లా రాజశేఖర్రెడ్డి, కొత్త కృష్ణవేణి, శ్రీనివాస్, నిర్వాహకులు లోకం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.