ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీని కలిసిన TANA ప్రతినిధులు!
ABN , First Publish Date - 2021-12-04T00:41:04+05:30 IST
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రతినిధులు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలు చర్చించారు. ఇందులో భాగంగా.. తానా ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించి.. ఆయన మద్దతు కోరారు. ఆంధ్రజ్యోతి ఎండీని కలిసిన వారిలో వాశిరెడ్డి ప్రసాద్, తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, కనుమూరి బాజి చౌదరి, శృంగవరపు విజయ్, తానా మాజీ అధ్యక్షుడు జయశేఖర్ తాల్లూరి ఉన్నారు.