పప్పు పొడులతో పులిహోర

ABN , First Publish Date - 2015-09-02T17:41:58+05:30 IST

కావలసిన పదార్థాలు: చింతపండు చిక్కటి గుజ్జు - 1 కప్పు, పసుపు - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత

పప్పు పొడులతో పులిహోర

కావలసిన పదార్థాలు: చింతపండు చిక్కటి గుజ్జు - 1 కప్పు, పసుపు - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, కరివేపాకు (విడి ఆకులు) - 1 కప్పు, ఆవాలు - 1 టీ స్పూను, మినప్పప్పు, శనగపప్పు - 2 టీ స్పూన్ల చొప్పున, వేరుశనగ పప్పు - 1 కప్పు, పచ్చిమిర్చి - 8, అన్నం - కిలో బియ్యంతో (పొడిగా) వండింది, ఇంగువ - అర టీ స్పూను.
పొడికోసం: ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర - 2 టీ స్పూన్ల చొప్పున, ఎండుమిర్చి - 6, నువ్వులు - 1 టేబుల్‌ స్పూను. (నువ్వులు + తతిమ్మావి విడివిడిగా దోరగా వేగించుకుని అన్నీ కలిపి పొడి చేసి పెట్టుకోవాలి)
తయారుచేసే విధానం: కడాయిలో 1 టేబుల్‌ స్పూను నూనె వేసి పసుపు, చింతపండు గుజ్జు, ఉప్పు, పప్పుపొడి (అవసరమైతే కొన్ని నీళ్లు) జతచేస్తూ బాగా ఉడికించి పులుసుని చిక్కబడనిచ్చి అన్నంలో కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో మిగిలిన నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువలతో పోపు పెట్టుకొని (చింతగుజ్జు మిశ్రమం కలిపిన) అన్నంలో బాగా కలపాలి. పొడిలో పప్పులు, జీలకర్ర, ధనియాలకు బదులుగా నువ్వులు మాత్రమే (1 కప్పు) ఎండుమిర్చితో పాటు వేగించి పొడి చేసుకుని ఇదే తరహాలో విడిగా ‘నువ్వుల పులిహోరా’ని కూడా చేసుకోవచ్చు.

Updated Date - 2015-09-02T17:41:58+05:30 IST