కీర వడియాలు

ABN , First Publish Date - 2017-04-22T21:35:25+05:30 IST

కావాల్సిన పదార్థాలు మినపప్పు-250 గ్రాములు (రాత్రి నానబెట్టాలి)

కీర వడియాలు

కావాల్సిన పదార్థాలు
 
మినపప్పు-250 గ్రాములు (రాత్రి నానబెట్టాలి)
కీర-1 కిలో (లోపల గింజలు ఉండేవి)
బ్లాక్‌ పెప్పర్‌ -25 గ్రాములు
జీలకర్ర-తగినంత
నల్ల ఏలకులు-5-6

తయారీ విధానం
 
మినపప్పును కనీసం నాలుగు గంటల పాటు నీళ్లల్లో నానబెట్టాలి. కీరాను తొక్క తీసి తురమాలి. వాటిల్లోని విత్తనాలను విడిగా తీసి పెట్టుకోవాలి. తురిమిన కీరాను పిండి ఆ జ్యూసును విడిగా ఒక గిన్నెలోకి పోయాలి. మినపప్పు, ఇతర పదార్థాలతోపాటు కొన్ని కీరా నీళ్లను కూడా మినపప్పులో పోసి పిండి చిక్కగా అయ్యేవరకూ రుబ్బాలి. కీరా తురుము, గింజలు రెండింటినీ ఆ పిండిలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక వెదురు చాపమీద పెద్ద నేత గుడ్డ పరిచి రుబ్బిన పిండిని ఒక్కొక్క చెంచా గుడ్డ మీద పెట్టుకుంటూ వెళ్లాలి. మూడు లేదా నాలుగు రోజుల పాటు వీటిని ఎండలో ఉంచితే బాగా ఎండుతాయి. ఈ వడియాలు సగం ఎండిన తర్వాత గుడ్డ నుంచి తీసి ఎండబెట్టాలి. అలా బాగా ఎండిన వడియాలను గాలి సోకని డబ్బాలో పెట్టాలి. ఇది మంచి సమ్మర్‌ రెసిపీ.

Updated Date - 2017-04-22T21:35:25+05:30 IST