జీడిపప్పుతో మష్రూమ్స్‌

ABN , First Publish Date - 2015-08-31T16:56:16+05:30 IST

కావలసిన పదార్థాలు: మష్రూమ్‌ ముక్కలు - 300 గ్రాములు, ఉల్లిపాయలు -2, పచ్చిమిర్చి -4

జీడిపప్పుతో మష్రూమ్స్‌

కావలసిన పదార్థాలు
 
మష్రూమ్‌ ముక్కలు - 300 గ్రాములు, ఉల్లిపాయలు -2, పచ్చిమిర్చి -4, అల్లం పేస్టు -1 టీ స్పూను, టమోటా గుజ్జు - 2 కప్పులు, నానబెట్టి రుబ్బిన జీడిపప్పు పేస్టు - పావు కప్పు, ధనియాల పొడి - 1 టీ స్పూను, దాల్చినచెక్క -2 అంగుళాలు, లవంగాలు -3, యాలకులు - 3, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - పావు టీ స్పూను, నూనె - 1 టేబుల్‌ స్పూను.
 
తయారీ విధానం
 
దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేగించి పొడి చేసి పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, అల్లం పేస్టు వేగించాక టమోటా గుజ్జు వేయాలి. తర్వాత కారం, పసుపు, మసాలా పొడి, జీడిపప్పు గుజ్జు కలపాలి. ఐదు నిమిషాల తర్వాత మష్రూమ్‌ ముక్కలు, ఉప్పు వేసి సన్నని మంటపై 15 నిమిషాలు ఉంచాలి. ఈ కూర చపాతీ, పరాటాల్లోకి రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-08-31T16:56:16+05:30 IST