కావలసినవి
సీతాఫలాలు - అరకిలో, టొమాటోలు - మూడు, మెంతులు - అర టీస్పూను, రెడ్ మిర్చీ ఫ్లేక్స్, ఉప్పు, గరంమసాలా, ఆమ్చూర్, చక్కెర - ఒక్కొటీ ఒక్కో టీస్పూను, నూనె - ఒక టేబుల్స్పూను.
తయారీవిధానం
సీతాఫలాల గుజ్జు తీయాలి. కడాయి తీసుకుని అందులో కొద్దిగా నూనె వేయాలి
నూనె వేడెక్కాక మెంతులు వేయాలి. అవి చట్పట్ మనడం మొదలవగానే సీతాఫలం గుజ్జు, ఇతర అన్ని మసాలాదినుసులు, టొమాటో ముక్కలు కడాయిలో వేసి పది నిమిషాలు ఉడికించాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. దాంతో కాసేపటికి సబ్జీ చిక్కగా తయారవుతుంది. కాస్త తీయగా, ఇంకాస్త కారంగా ఉండే ఈ ఖట్టీ మీఠీ సీతాఫల్ సబ్జీ రోటీలోకిగానీ, అన్నంలోగానీ తింటే వెరైటీగా ఉంటుంది.