12గంటల పని విధానాన్ని రద్దు చేయాలి: ఏఐటీయూసీ
ABN , First Publish Date - 2022-07-02T06:46:36+05:30 IST
కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి తలపెట్టిన 12గంటల పని విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
కర్నూలు (కలెక్టరేట్) జూలై 1: కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి తలపెట్టిన 12గంటల పని విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు జె.లలితమ్మ, ఎన్.మనోహర్ మాణిక్యం, ఎస్.మునెప్ప హాజరై మాట్లాడారు. కార్మిక వర్గం బ్రిటీష్ కాలం నుంచి అనేక పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 చట్టాల్ని రద్దు చేయడం దుర్మార్గమన్నారు. అలాగే వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ను తీసుకురావడం వలన భారతదేశ కార్మిక వర్గం పని భద్రత సామాజిక భద్రత లాంటి అనేక హక్కులకు దూరమవుతుందని అన్నారు. తక్షణమే 12 గంటల పని విధానాన్ని అమలు నిలిపివేసి 8 గంటల పని విధానం కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు బి.వెంకటేష్, నగర ఉప ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, బి.కుమార్ నల్లన, ఈశ్వర్, గణేష్, కిట్టు, రాము, శ్రీను పాల్గొన్నారు.