Eid al-Adha: అబుధాబి సంచలన నిర్ణయం!

ABN , First Publish Date - 2021-07-16T17:58:45+05:30 IST

ఈద్ అల్-అధా సెలవుల నేపథ్యంలో యూఏఈ రాజధాని అబుధాబి తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

Eid al-Adha: అబుధాబి సంచలన నిర్ణయం!

అబుధాబి: ఈద్ అల్-అధా సెలవుల నేపథ్యంలో యూఏఈ రాజధాని అబుధాబి తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈద్ సెలవులు ప్రారంభం అవుతున్న సోమవారం నుంచి అబుధాబిలో పాక్షిక లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈద్ సెలవులు ముగిసే వరకు కేవలం అబుధాబిలోనే లాక్‌డౌన్ ఉంటుందని, దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఎలాంటి ఆంక్షలు ఉండబోవని సంబంధిత అధికారులు వెల్లడించారు. సోమవారం నుంచి సెలవులు ముగిసే వరకు ప్రతిరోజు రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో ఉంటాయని గురువారం రాత్రి అధికారులు తెలిపారు. కోవిడ్-19 నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, నేషనల్ స్టెరిలైజేషన్ కార్యక్రమంలో భాగంగానే ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు అబుధాబి ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ కమిటీ పేర్కొంది. 

Updated Date - 2021-07-16T17:58:45+05:30 IST