ప్రైవేట్‌ బడుల్లో అధిక ఫీజులు అరికట్టాలి

ABN , First Publish Date - 2021-07-25T06:40:58+05:30 IST

ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజుల

ప్రైవేట్‌ బడుల్లో అధిక ఫీజులు అరికట్టాలి

హైదరాబాద్‌ సిటీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లోని ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని ఏబీవీపీ సెంట్రల్‌ కమిటీ మెంబర్‌ శ్రీహరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల నుంచి నెలవారీ ట్యూషన్‌ ఫీజులు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం జీవో 46ని అమలులోకి తీసుకొచ్చినప్పటికీ, నగరంలోని పలు కార్పొరేట్‌, టెక్నో స్కూళ్లు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. కొవిడ్‌ తీవ్రతతో ఉపాధి కరువై, వ్యాపారాలు దెబ్బతిని చాలామంది తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ట్యూషన్‌ ఫీజులు మాత్రమే తీసుకోవాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న పాఠశాలలను సీజ్‌ చేయాలని అధికారులను ఒక ప్రకటనలో కోరారు.

Updated Date - 2021-07-25T06:40:58+05:30 IST