ఆలయానికి ఏసీల విరాళం
ABN , First Publish Date - 2021-10-27T04:44:59+05:30 IST
మండలంలోని మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో వెలసిన మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తుడు ఏసీలను ఏవో పాండురంగారెడ్డి, చైర్మన్ లక్ష్మీరెడ్డికి మంగళవారం అందజేశారు.
బేతంచెర్ల, అక్టోబరు 26: మండలంలోని మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో వెలసిన మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తుడు ఏసీలను ఏవో పాండురంగారెడ్డి, చైర్మన్ లక్ష్మీరెడ్డికి మంగళవారం అందజేశారు. కల్లూరు మండలం లక్ష్మీనగర్కు చెందిన రాధాకృష్ణ రెడ్డికి స్వామి అమ్మవార్లు ఇంటి ఇలవేల్పు కావడంతో రూ.45 వేలు విలువ చేసే ఏసీలను విరాళంగా అందజేశారని ఏవో, చైర్మన్ తెలిపారు. ఆలయ ధర్మకర్తలు, ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.