ప్రీపెయిడ్‌ ఏసీ వెయిటింగ్‌ హాల్‌

ABN , First Publish Date - 2022-10-01T05:27:36+05:30 IST

ప్రీపెయిడ్‌ ఏసీ వెయిటింగ్‌ హాల్‌

ప్రీపెయిడ్‌ ఏసీ వెయిటింగ్‌ హాల్‌

గిర్మాజిపేట, సెప్టెంబరు 30 : వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో ప్రీపెయిడ్‌ ఏసీ వెయిటింగ్‌ హాల్‌ ప్రయాణికులకు అందుబాటులోకి వ చ్చింది. రైల్వేస్టేషన్‌లోని మొదటి ఫ్లాట్‌ ఫాం పై వరంగల్‌ వైపు ప్రవేశద్వారం పక్కనే రైల్వేశాఖ ప్రయివేట్‌ కాంట్రాక్టర్‌ ఆధ్వర్యంలో ప్రీపెయిడ్‌ వెయిటింగ్‌ రూంను ఏర్పాటు చేసింది. ఏసీతో కూడిన ఈ విశ్రాంతి మంది రంలో టీవి, మహిళలు, పురుషులకు వేరువే రుగా వాష్‌రూంలు, కుషన్‌ సీట్లు ఉన్నాయి. విశ్రాంతి తీసుకు నేందుకు గంటకు రూ.25 చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఇలా ఎన్నిగంటలైనా ఉండొచ్చు. ప్రస్తుతం సికింద రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉన్న ఈ సదుపాయం ఇప్పుడు వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో సాధారణ, మొదటి తరగతి, మహిళలకు ఉచిత విశ్రాంతి మందిరాలు ఉన్నాయి. ప్రీపెయిడ్‌  ఏసీ హాల్‌ కాంట్రాక్ట్‌ కాలం 2027 వర కు ఉందని రైల్వేవర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-10-01T05:27:36+05:30 IST