విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-07-01T06:30:00+05:30 IST
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
వికారాబాద్, జూన్ 30 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించి టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను చేపట్టాలని రాష్ట్ర యూఎ్సపీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు జంగయ్య పేర్కొన్నారు. స్థానిక గరీబ్నగర్ పాఠశాల ఆవరణలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రమోషన్లు ఇస్తామని, బదిలీలు చేస్తామని చెప్పి 15 రోజులు అవుతున్నా.. ఇప్పటికీ ఆ ఊసే లేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రవీందర్, కిష్టప్ప, రాజశేఖర్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటరత్నం, బందప్ప, రత్నం, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.