ఏసీబీ వలకు చిక్కిన ఇరిగేషన్ ఏఈ
ABN , First Publish Date - 2020-07-07T07:08:13+05:30 IST
ఏసీబీ వలకు చిక్కిన ఇరిగేషన్ ఏఈ
ఇల్లెందు, జూలై 6: లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు ఒక నీటిపారుదల శాఖ ఏఈ చిక్కాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం అనంతారం చెరువు నిర్మాణ పనులను కాంట్రాక్టర్ గుండ్ల రమేశ్ చేశారు. దానికి సంబంధించిన రూ.20లక్షల బిల్లులు అతనికి చెల్లించాల్సి ఉంది. ఆ బిల్లులు పై అధికారులకు పంపేందుకు ఏఈ నవీన్ రూ.1.20లక్షలు డిమాండ్ చేయడంతో ఏసీబీని కాంట్రాక్టర్ ఆశ్రయించారు. దాంతో వలపన్నిన వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు.. లంచం సొమ్మును ఏఈ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.