రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
ABN , First Publish Date - 2022-01-25T05:10:04+05:30 IST
రాయచోటి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో సోమవారం సాయంత్రం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
రాయచోటి, జనవరి 24: రాయచోటి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో సోమవారం సాయంత్రం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ కంజాక్షన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో పలు రికార్డులను పరిశీలించారు. నిర్ధిష్టమైన ఫిర్యాదులు ఏమీ లేవని ఆకస్మిక తనిఖీ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం ప్లాన్ అప్రూవల్ దరఖాస్తులు, వాటిపై మున్సిపాలిటీ స్పందించిన విధానం వంటి వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఈతనిఖీల్లో ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్లు కృష్ణమోహన్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రోజూ రాత్రి 9 గంటల వరకు మున్సిపల్ కార్యాలయంలో హడావిడిగా ఉండేది. అయితే ఏసీబీ దాడుల నేపధ్యంలో సాయంత్రం 5 గంటలకే టౌన్ప్లానింగ్ విభాగం తప్ప మిగిలినవన్నీ మూతవేయడంపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.