ఏసీబీ అధికారులను హెచ్చరించిన చినరాజప్ప
ABN , First Publish Date - 2021-04-23T21:49:51+05:30 IST
ఏసీబీ అధికారులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలన్నారు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప.
అమరావతి: ఏసీబీ అధికారులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలన్నారు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రెస్ మీట్లు పెడితే చట్టపరమైన చర్యలకు వెనుకాడమని హెచ్చరించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని ఏసీబీ గుర్తుంచుకోవాలన్నారు. ‘‘ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరచడం కోసం నిబంధనలను అతిక్రమిస్తారా?’’ అని ప్రశ్నించారు.