లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లైన్మన్
ABN , First Publish Date - 2022-08-27T18:04:33+05:30 IST
లంచం తీసుకుంటుండగా లైన్మన్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాడెడ్గా పట్టుకున్నారు. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన శివకుమార్రెడ్డి
కొండాపూర్ సబ్స్టేషన్ పరిధిలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్/రాయదుర్గం: లంచం తీసుకుంటుండగా లైన్మన్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాడెడ్గా పట్టుకున్నారు. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన శివకుమార్రెడ్డి ఫ్యానల్బోర్డు, ఎలక్ర్టికల్ మీటర్ పిట్టింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో లైన్మన్ శ్రీనివా్సరావు అతని వద్ద రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో అతను లైన్మన్కు రూ.5 వేలు ఇచ్చి, మిగతా రూ.15వేలు శుక్రవారం కొండాపూర్ శ్రీరాంనగర్లోని సైట్ వద్ద ఇస్తుండగా ముందస్తుగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్ సబ్స్టేషన్లో సోదాలు చేశారు.