లారీ ఢీకొని బాలుడు మృతి

ABN , First Publish Date - 2020-11-30T04:36:26+05:30 IST

లారీ ఢీకొనడంతో తా హీర్‌ (10) మృతి చెందిన సంఘటన ఆదివారం పెద్దశెట్టిపల్లె వద్ద చోటు చేసుకుంది.

లారీ ఢీకొని బాలుడు మృతి
మృతి చెందిన బాలుడు తాహీర్‌

మైదుకూరు, నవంబరు 29: లారీ ఢీకొనడంతో  తా హీర్‌ (10) మృతి చెందిన సంఘటన ఆదివారం పెద్దశెట్టిపల్లె వద్ద చోటు చేసుకుంది. పోలీసులు అం దించిన సమాచారం మేర కు వివరాలిలావున్నాయి. ఎస్సీ కాలనీ వాసులు చేజ ర్ల ప్రభాకర్‌, సుబ్బమ్మ కుమారుడు తాహీర్‌ రోడ్డు దాటుతుండగా బద్వేల్‌ వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొంది. దీంతో బాలునికి తీవ్రగా యాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా దంపతులకు ఒకే కుమారుడు కావడంతో  బాలుడి మృతి వీరిని కలిచివేసిందని చెప్పవచ్చు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-11-30T04:36:26+05:30 IST