నూతన డీఈవో బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2021-09-18T07:10:59+05:30 IST
నిర్మల్ జిల్లా నూతన డీఈవోగా రవీందర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆదిలాబాద్ డీఈవోగా ఈయన పని చేశారు.
నిర్మల్ కల్చరల్, సెప్టెంబరు 17: నిర్మల్ జిల్లా నూతన డీఈవోగా రవీందర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆదిలాబాద్ డీఈవోగా ఈయన పని చేశారు. ఈ సందర్భంగా టీయూటీఎఫ్ నాయకులు లక్ష్మిప్రసాద్ రెడ్డి, మురళీమనోహర్రెడ్డి,తదితరులు డీఈవోను మర్యాదపూర్వకంగా కలిశారు.
డీఈవోను కలిసిన ఎస్టీయూ నాయకులు..
నిర్మల్ డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్ రెడ్డిని ఎస్టీయూ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పు ష్పగుచ్ఛం అందించారు. ఇందులో గజేందర్, భూమన్న యాద వ్, లక్ష్మణ్, షబ్బీర్ అలీ, సిరాజుద్దీన్ తదితరులున్నారు.
అమ్మవారిని దర్శించుకున్న డీఈవో..
బాసర: బాసర సరస్వతి అమ్మవారిని డీఈవోగా నియమితులైన డాక్టర్ రవీందర్ రెడ్డి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదువుల మాత బాసర సరస్వతి అమ్మవారు అంటే సెంటిమెంట్ అని నూతన పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు సరస్వతి మాతను దర్శించుకు నేందుకు వచ్చినట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఆయన వెంట బోథ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ మాదాపురం ఉమేష్ రావు తదితరులు ఉన్నారు.