విద్యుత్ శాఖ ఎస్ఈ బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2021-08-03T07:03:42+05:30 IST
ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈగా పి. నాగరాజు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయ ంలో ఆయన బాధ్యతలు చేపట్టారు
అనంతపురం రూరల్, ఆగస్టు2: ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈగా పి. నాగరాజు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయ ంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈయన తిరుపతి నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. గతంలో నెల్లూరు, పులివెందులలో ఈఈగా పనిచేస్తూ ఎస్ఈగా ఉద్యోగోన్నతి పొందారు. ఈక్రమంలోనే తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో ఎక్వైరీ విభాగం ఎస్ఈగా పనిచేస్తూ ఇక్కడికి బదిలీ అయ్యారు. బాఽ ద్యతలు స్వీకరించిన ఆయనకు శాఖలోని ఈఈ లు, డీఈఈలు, ఏఈఈలు, యూనియన్ నాయకులు, కాంట్రాక్టర్లు తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.