ఆటో బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

ABN , First Publish Date - 2021-04-18T05:46:36+05:30 IST

ఆటో బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

ఆటో బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

నందిగామ రూరల్‌, ఏప్రిల్‌ 17: మండలంలోని మునగచర్ల జాతీయ రహదారిపై శనివారం వేకువ జామున ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నడికుడి మండలం కేశపురం గ్రామానికి చెందిన నరేష్‌ నిమ్మకాయల లోడుతో తెనాలి వెళ్తుండగా మునగచర్ల వద్ద ఆటో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. నిద్రమత్తు కారణంగా అదుపు తప్పి బోల్తా పడిందని బాధితుడు తెలిపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన నరేష్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-04-18T05:46:36+05:30 IST