లారీ బోల్తా : డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2021-05-07T05:47:18+05:30 IST
లారీ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందినట్లు కొవ్వూరు రూరల్ హెడ్ కానిస్టేబుల్ పిఎస్.రామకృష్ణ తెలిపారు.
కొవ్వూరు, మే 6 : లారీ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందినట్లు కొవ్వూరు రూరల్ హెడ్ కానిస్టేబుల్ పిఎస్.రామకృష్ణ తెలిపారు. నరసాపురం గ్రామానికి చెందిన గన్నాబత్తుల వీరవెంకటప్రసాద్(57) ఈ నెల 5న మెటల్ కోసం లారీతో కొవ్వూరు మండలం ఐ.పంగిడి వెళ్లాడు. రాత్రి 10.10 గంటలకు తిరిగి వెళుతుండగా పంగిడి శివారు పెట్రోలు బంకు వద్ద లారీ అదుపుతప్పి ఎడమ వైపు రోడ్డుమార్జిన్ దిగి కుడివైపు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రసాద్ బండిలో చిక్కుకుపోయి తలకు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. క్లీనర్ సమాచారం అందించడంతో ప్రసాద్ భార్య పద్మావతి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ రామకృష్ణ తెలిపారు.