లారీ బోల్తా : డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-05-07T05:47:18+05:30 IST

లారీ బోల్తాపడి డ్రైవర్‌ మృతి చెందినట్లు కొవ్వూరు రూరల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పిఎస్‌.రామకృష్ణ తెలిపారు.

లారీ బోల్తా : డ్రైవర్‌ మృతి

కొవ్వూరు, మే 6 : లారీ బోల్తాపడి డ్రైవర్‌ మృతి చెందినట్లు కొవ్వూరు రూరల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పిఎస్‌.రామకృష్ణ తెలిపారు. నరసాపురం గ్రామానికి చెందిన గన్నాబత్తుల వీరవెంకటప్రసాద్‌(57) ఈ నెల 5న మెటల్‌ కోసం లారీతో కొవ్వూరు మండలం ఐ.పంగిడి వెళ్లాడు. రాత్రి 10.10 గంటలకు తిరిగి వెళుతుండగా పంగిడి శివారు పెట్రోలు బంకు వద్ద లారీ అదుపుతప్పి ఎడమ వైపు రోడ్డుమార్జిన్‌ దిగి కుడివైపు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ ప్రసాద్‌ బండిలో చిక్కుకుపోయి తలకు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. క్లీనర్‌ సమాచారం అందించడంతో ప్రసాద్‌ భార్య పద్మావతి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2021-05-07T05:47:18+05:30 IST