రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు దుర్మరణం

ABN , First Publish Date - 2021-05-15T05:53:09+05:30 IST

ఎదురుగా వచ్చిన గేదెను ఢీకొట్టిన డీసీఎం అదుపుతప్పి లారీని ఢీకొనడంతో డీసీఎం డ్రైవరు, అతని తండ్రి దుర్మరణం చెందిన

రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు దుర్మరణం

 మృతులు పశ్చిమగోదావరి జిల్లా వాసులు

 గేదెను ఢీకొని అదుపు తప్పిన  డీసీఎం

కూసుమంచి, మే 14: ఎదురుగా వచ్చిన గేదెను ఢీకొట్టిన డీసీఎం అదుపుతప్పి లారీని ఢీకొనడంతో డీసీఎం డ్రైవరు, అతని తండ్రి  దుర్మరణం చెందిన ఘటన  కూసుమంచి వద్ద చోటుచేసుకుంది. కూసుమంచి సీఐ సతీష్‌ కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జల్లా తడికెలపూడి నుంచి కొబ్బరికాయల లోడుతో వెళుతున్న డీసీఎం శుక్రవారం తెల్లవారుజామున రెండుగంటల సమయంలో కూసుమంచి సమీపంలో  ఎదురుగా వచ్చిన గేదెను ఢీకొంది. డీసీఎం అదుపుతప్పడంతో సూర్యాపేట వైపునుంచి ఖమ్మం వైపు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈఘటనలో డీసీఎం డ్రైవరు  లొకసాని శివారెడ్డి(23), అందులో ప్రయాణిస్తున్న అతడి తండ్రి లొకసాని నర్సింహారెడ్డి(52) అక్కడిక్కడే క్యాబిన్‌లో ఇరుక్కుని దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదం కారణంగా రెండువాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇరువైపులా ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. సమాచారం తెలసుకున్న కూసుమంచి సీఐ సతీష్‌ సిబ్బందితో వెళ్లి ప్రమాదానికి గురయిన వాహనాలను పక్కకు తీయించి వెంటనే ట్రాఫిక్‌క్లియర్‌ చేయించారు. లారీడ్రైవరుకు గాయాలు అవడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Updated Date - 2021-05-15T05:53:09+05:30 IST