రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2021-07-19T05:26:26+05:30 IST
మండలంలోని బుర్గూడెం శివారులో ద్విచక్రవాహనాన్ని బొగ్గు టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
అన్నపురెడ్డిపల్లి, జులై 18: మండలంలోని బుర్గూడెం శివారులో ద్విచక్రవాహనాన్ని బొగ్గు టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈసంఘటన ఆదివారం జరిగింది. అబ్బుగూడేనికి చెందిన చిలుకూరి వెంకటరెడ్డి తన తల్లి సత్యవతితో కలిసి బంధువుల ఇళ్లకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో బుర్గూడెం వద్ద కొత్తగూడెం నుంచి వస్తున్న బొగ్గు టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు వెంటనే యర్రగుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యు లు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.