రోడ్డు ప్రమాదంలో పొగాకు రైతు మృతి
ABN , First Publish Date - 2021-07-27T04:10:15+05:30 IST
డీసీసల్లి పొగాకు వేలంకేంద్రం వద్ద రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని వింజమూరు మండలం గుండెమడకలకు చెందిన వెంకటరత్నం(45) అనే రైతు
మర్రిపాడు(ఆత్మకూరు), జూలై 26: డీసీసల్లి పొగాకు వేలంకేంద్రం వద్ద రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని వింజమూరు మండలం గుండెమడకలకు చెందిన వెంకటరత్నం(45) అనే రైతు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వేలానికి బేళ్లను తీసుకొచ్చిన ఆయన వేకువజామున కేంద్రానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేడీసీసు నమోదు చేశారు.