ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో

ABN , First Publish Date - 2021-07-27T05:34:36+05:30 IST

ఉంగుటూరు మం డలం బాదంపూడి రైల్వే వంతెన వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో
ప్రమాద దృశ్యం

ఒకరి మృతి.. నలుగురికి గాయాలు

ఉంగుటూరు, జూలై 26: ఉంగుటూరు మం డలం బాదంపూడి రైల్వే వంతెన వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. టైరు పంక్చరై ఆగిన లారీని తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి నుంచి కొవ్వలికి రొయ్యల చెరువు పట్టుబడి నిమిత్తం కూలీలతో వెళుతున్న ఆటో వెనుక నుంచి ఢీకొనడంతో ఆటో ప్రయాణికుల్లో సంగాడి రాము(35) అక్కడికక్కడే మృతిచెందాడు. గాయ పడిన ఓలేటి దేవ రాజు, ఓలేటి ఏసు, రేఖడి స్వామి, పి.వీరబాబును ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మల్లాడి నూకరాజు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్‌ఐ స్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాము మృత దేహానికి తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపించారు.


Updated Date - 2021-07-27T05:34:36+05:30 IST