బైకులు ఢీకొని వ్యక్తికి గాయాలు
ABN , First Publish Date - 2020-11-27T05:45:15+05:30 IST
కంచికచర్ల పట్టణంలోని శ్రీనివాస థియేటర్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో వ్యక్తికి గాయాలయ్యాయి.
కంచికచర్ల రూరల్ : కంచికచర్ల పట్టణంలోని శ్రీనివాస థియేటర్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఖమ్మం నుంచి విజయవాడ వెళ్తున్న శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలు కావటంతో 108 అంబులెన్స్లో విజయవాడ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.