రైల్వే బ్రిడ్జి పిల్లర్ను ఢీకొన్న లారీ.. డ్రైవర్ దుర్మరణం
ABN , First Publish Date - 2020-11-27T06:06:15+05:30 IST
రైల్వే బ్రిడ్జి పిల్లర్ను ఢీకొన్న లారీ.. డ్రైవర్ దుర్మరణం
విజయవాడ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): కనకదుర్గ ఫ్లై ఓవర్పై నుంచి వేగంగా వచ్చిన మిక్సర్ లారీ రాజీవ్గాంధీ పార్కు వద్ద ఉన్న ఇనుప స్తంభాన్ని, రైల్వే బ్రిడ్జి పిల్లర్ను ఢీ కొట్టింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో కేసీపీ ఫ్యాక్టరీలో డ్రైవర్గా పనిచేస్తున్న జగ్గయ్యపేటకు చెందిన ఇస్సాక్ మృతి చెందాడు. డ్రైవర్ వేగంగా నడపడం, కనురెప్ప వాల్చడం ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇస్సాక్ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మరణించాడు. కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.