రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

ABN , First Publish Date - 2020-11-27T06:07:33+05:30 IST

మండలంలోని చిల్లకూరు వడ్డిపాళెం గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

పెళ్లకూరు, నవంబరు 26 : మండలంలోని చిల్లకూరు వడ్డిపాళెం గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. చిల్లకూరు నుంచి వడ్డిపాళెంకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వేణుగోపాల్‌ను శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేట వైపు వెళ్తున్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో వేణుగోపాల్‌ కాలుకు తీవ్ర గాయమైంది. స్థానికులు బాధితుడిని పెళ్లకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాయుడుపేటకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.




Updated Date - 2020-11-27T06:07:33+05:30 IST