రెండు స్కూటర్లు ఢీ

ABN , First Publish Date - 2020-12-03T04:40:56+05:30 IST

మండలంలోని కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిలోని చిట్లూరు గ్రామం పాలన్నగారిపల్లె బ్రిడ్జి దగ్గర రెండు స్కూటర్లు ఎదురుగా ఢీకొన్నాయి.

రెండు స్కూటర్లు ఢీ

రామాపురం, డిసెంబరు2: మండలంలోని కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిలోని చిట్లూరు గ్రామం పాలన్నగారిపల్లె బ్రిడ్జి దగ్గర రెండు స్కూటర్లు ఎదురుగా ఢీకొన్నాయి. దీంతో స్కూటర్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలైనట్లు రామాపురం పోలీసులు తెలిపారు. రాయచోటి నుంచి కడప వైపు ఒకరు, కడప వైపు నుంచి రాయచోటి వైపు ఒకరు స్కూటర్లలో వస్తూ ఢీకొన్నారు. పోలీసుల సమాచారం మేరకు తీవ్రగాయాలతో ఉన్న వ్యక్తి వద్ద ఏ ఆధారాలు లేవని, అతను మాట్లాడే స్థితిలో లేడని, ముక్కు నుంచి రక్తం వస్తోందన్నారు. వెంటనే 108 వాహనంలో క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2020-12-03T04:40:56+05:30 IST