రోడ్డు ప్రమాదంలో టీఏకు గాయాలు
ABN , First Publish Date - 2020-12-04T03:53:51+05:30 IST
మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొండూరు సత్రం సమీపంలోని జ్యోతినగర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధిహామీ టీఏకు తీవ్ర గాయాలయ్యాయి.
మనుబోలు, డిసెంబరు 3: మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొండూరు సత్రం సమీపంలోని జ్యోతినగర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధిహామీ టీఏకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలో ఉపాధిహామీ సాంకేతిక సహాయకులుగా నెల్లూరుకు చెందిన సీహెచ్. శ్రీనివాసులు పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని బైక్పై నెల్లూరుకు వెళుతుండగా హఠాత్తుగా రోడ్డు పక్కన పొలంలో నుంచి వచ్చిన ట్రాక్టరు బైక్ ముందుకొచ్చి మలుపుతిప్పే క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న వేగాన్ని అదుపుచేయలేక మోటార్ బైక్ ట్రాక్టర్ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో శ్రీనివాసులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రైవేట్ వాహనంలో చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గురువారం శ్రీనివాసులును డ్వామా పీడీ సాంబశివారెడ్డి, ఉపాధిహామీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మధు, ఏపీవో వెంకటేశ్వర్లు పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.