రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-03-01T03:59:15+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
రహదారిపై పడియున్న మృతదేహాలు

మరొకరికి తీవ్ర గాయాలు 

అంబాల వద్ద ఢీకొన్న రెండు ద్విచక్రవాహనాలు


కమలాపూర్‌, ఫిబ్రవరి 28: వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం అంబాల గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మండలం లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన గురజపల్లి సత్యారావు (40) కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ హన్మకొండలోని భవానీనగర్‌లో నివాసముంటున్నాడు. అదే జిల్లా నడికూడ మండలం ధర్మారం గ్రామానికి చెందిన దానబోయిన వీరస్వామి(52) స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ హన్మకొండలోని వడ్డెపల్లిలో ఉంటున్నాడు. లక్ష్మీపూర్‌ గ్రామ శివారులో చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులు చూసుకొనిసత్యారావు తన బైక్‌పై సాయంత్రం హన్మకొండకు బయలుదేరాడు. అదే సమయంలో హన్మకొండ నుంచి వీరస్వామి అదే గ్రామానికి చెందిన బొజ్జం ఆనందంతో కలిసి తన బైక్‌పై స్వగ్రామం ధర్మారానికి బయలుదేరాడు. ఇద్దరు అంబాల గ్రామ శివారులోకి రాగానే రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సత్యారావు, వీరస్వామి అక్కడికక్కడే మృతి చెందగా, బొజ్జం ఆనందంకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హన్మకొండలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా, వరంగల్‌రూరల్‌ జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు గురుజపల్లి ప్రకా్‌షరావు కుమారుడైన సత్యరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలసుకున్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్‌, ఎల్కతుర్తి సీఐ శ్రీనివా్‌సజీ, సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు  తెలుసుకున్నారు. మృతదేహాలను వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి తరలించారు. సత్యారావుకు భార్య, కుమార్తె ఉన్నారు. వీరస్వామికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

Updated Date - 2021-03-01T03:59:15+05:30 IST