రైలు ఢీకొని వృద్ధుడి మృతి
ABN , First Publish Date - 2021-03-02T05:46:40+05:30 IST
కంచరపాలెం సమీ పంలోని రామ్మూర్తి పంతులుపేట రైల్వే వంతెన వద్ద సోమవారం రైలు ఢీకొట్టిన ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడు ఒకరు మృతి చెందాడు.
తాటిచెట్లపాలెం, మార్చి 1: కంచరపాలెం సమీ పంలోని రామ్మూర్తి పంతులుపేట రైల్వే వంతెన వద్ద సోమవారం రైలు ఢీకొట్టిన ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడు ఒకరు మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుని వయసు దాదాపు 60 ఏళ్లు ఉండవచ్చునని, ఇతర వివరాలు ఏవీ అతని వద్ద లభించలేదని జీఆర్పీ ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. మృతుడిని గుర్తు పట్టిన వారు ఎవరైనా 8985752107ను సంప్రదించాలని కోరారు.