రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-04-23T05:37:57+05:30 IST

మండలంలోని పోట్లూరు సమీపంలో రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద బుధవారం రాత్రి గ్రామానికి చెందిన బొల్లా సంజీవరావు(42) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
బొల్లా సంజీవరావు(ఫైల్‌)

వేల్పూరు(శావల్యాపురం), ఏప్రిల్‌ 22: మండలంలోని పోట్లూరు సమీపంలో రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద బుధవారం రాత్రి గ్రామానికి చెందిన బొల్లా సంజీవరావు(42)  మృతి చెందాడు. సంజీవరావు వ్యక్తిగత పనులపై వినుకొండకు వెళ్ళి తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈ క్రమంలో  రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద గుంతలు ఉండడంతో బైకు అదుపుతప్పి రోడ్డు మీద పడిపోయింది. దీంతో రోడ్డుపై పడిన ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది నరరావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఇతడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. సంజీవరావు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అన్నయ్య కుమారుడు. సంజీవరావు అంత్యక్రియలను వేల్పూరు గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. అంత్యక్రియలలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరావు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Updated Date - 2021-04-23T05:37:57+05:30 IST