యానాం-ఎదుర్లంక వారధిపై ప్రమాదం... ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2022-04-18T02:57:15+05:30 IST
కోనసీమ జిల్లా యానాం-ఎదుర్లంక వారధిపై ఆదివారం మోటారుబైక్ను ఇసుకలోడుతో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది.
ఐ.పోలవరం: కోనసీమ జిల్లా యానాం-ఎదుర్లంక వారధిపై ఆదివారం మోటారుబైక్ను ఇసుకలోడుతో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలతో పాటు ఓ బాలుడు మృతి చెందారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన గుబ్బల సుబ్రహ్మణ్యం(49), గుబ్బల మంగాదేవి(42)లు కుమార్తె కొడుకు జశ్వంత్ శివకార్తీక్(6), మనవరాలు తేజశ్రీలక్ష్మిలతో కలిసి మోటార్సైకిల్పై శనివారం మధ్యాహ్నం ద్రాక్షారామలో తన చిన్నకుమార్తె అనచూరి వెంకటేశ్వరి ఇంటికి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా ఆదివారం సాయంత్రం యానాం-ఎదుర్లంక వారధిపై వీరిని టిప్పర్ ఢీకొట్టింది. దీంతో సుబ్రహ్మణ్యం, గుబ్బల మంగాదేవి, జశ్వంత్ శివకార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. తేజశ్రీలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఇసుకలారీను పోలీస్స్టేషన్కు తరలించి డ్రైవర్ సతీష్ను అదుపులోకి తీసుకున్నారు.