బొగ్గు లారీపై నుంచి పడి డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-10-27T05:00:53+05:30 IST

ప్రమాదవశాత్తూ జారిపడి లారీ డ్రైవర్‌ మృతిచెందాడు.

బొగ్గు లారీపై నుంచి పడి డ్రైవర్‌ మృతి

సత్తుపల్లిరూరల్‌, అక్టోబరు 26 : ప్రమాదవశాత్తూ జారిపడి లారీ డ్రైవర్‌ మృతిచెందాడు.ఆకివీడు మండలం కుప్పనకూడి గ్రామానికి చెందిన నీలపల్లి పరిశుద్ధమ్మ, అబ్రహాం దంపతుల కుమారుడు నీలపల్లి సురేష్‌ (29) కిష్టారం ఓసీలో విజయసాయి ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన లారీపై డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. యాదాద్రి సిమెంట్స్‌కు బొగ్గు లోడుతో వెళ్లేందుకు లారీపై పైకి ఎక్కి పరదా కడుతుండగా ప్రమాదవశాత్తూ జారి 10 అడుగుల లోతులో పడి తీవ్రగాయాలయ్యాయి. సింగరేణి అధికారులు హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం తరలిస్తున్న క్రమంలో సత్తుపల్లిలోనే మృతిచెందాడు.. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. 

Updated Date - 2021-10-27T05:00:53+05:30 IST